Don't Miss!
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తోనే..,మొదలెట్టేసారు,ఇదిగో సాక్ష్యం
హైదరాబాద్ : 'సర్దార్ గబ్బర్సింగ్' చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చి, రిలీజ్ కు రెడీ అవుతూండటంతో, పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఏం చేస్తాడనే విషయమై గత కొద్ది రోజులుగా మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయమై ఖరారు అయ్యిపోయింది. ఇదిగో ఈ ఫొటోనే సాక్ష్యం.
పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని తన స్నేహితుడు, తనతో రెండు సినిమాలు గతంలో డైరక్ట్ చేసిన ఎస్ జె సూర్యతో చేయనున్నారు. అంటే 'సర్దార్...' తరవాత పవన్ చేయబోయే చిత్రం ఎస్.జె.సూర్యతోనే అని ఖారారు అయ్యిపోయింది.
ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు మొదలైపోయాయట. ఇటీవలే ముంబయిలో సంగీత చర్చలు మొదలయ్యాయని తెలిసింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే మొదటి పాట రికార్డింగ్ పూర్తైపోయింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ విషయమై అఫీషియల్ న్యూస్ రావచ్చు. ఈ చిత్రాన్ని సైతం 'సర్దార్...' నిర్మాత శరద్ మారార్ నిర్మించనున్నారు.
ఇక 'గోపాల గోపాల' సమయంలో అనూప్ ఇచ్చిన సంగీతాన్ని ఇష్టపడ్డ పవన్ ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ విధంగా నిలబెట్టుకున్నారు. ఈ చిత్రం ఖుషీ సీక్వెల్ అని వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. కాబట్టి పవన్ ఫ్యాన్స్ మరి పండగ చేసుకోండి. నెక్ట్స్ సినిమా డిటేల్స్ తెలిసిపోయాయి కదా.