Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మోసపోయిన ఫ్యాన్స్: ‘S/o సత్యమూర్తి’ ఆడియో వేడుకపై కేసు
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/o సత్యమూర్తి' ఆడియో వేడుక ఇటీవల గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను శ్రేయాస్ మీడియా వారు ఆర్గనైజ్ చేసారు. తాజాగా ఈ వేడుకపై వివాదం నెలకొంది. ఆర్గనైజర్లపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు.
ఈ ఆడియో వేడక కోసం ఆర్గనైజర్లయి శ్రేయాస్ మీడియా వారు 6000 పాసులు అమ్మారు. అయితే ఆడియో వేడుకలోకి కేవలం 2000 పాస్ హోల్డర్స్ ను మాత్రమే అనుమతించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో మరో 4 వేల మంది పాసులు ఉన్నా లోనికి వెళ్లలేక పోయారు. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన ఫ్యాన్స్ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్ల తెలుస్తోంది.
పరిమితికి మించి పాసులు జారీ చేసి డబ్బులు దండుకున్నారని, మోస పూరితంగా వ్యవహరించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి పాసులు ఎందుకు జారీ చేసారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిర్వాహకులపై చర్యతీసుకునే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.