Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫ్యాన్స్ బెదిరింపు: ఇళయారాజాపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మీద కంప్లైంట్ నమోదైంది. ఏజిఐ మ్యూజిక్ సంస్థ అధినేత అఖిలన్ ఆయనపై ఫిర్యాదు చేసారు. ఇళయరాజా పాటలకు సంబంధించి 2007లో తమ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం కాల పరిమితి ముగియకుండానే ఇళయరాజా వేరే ఆడియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అఖిలన్ ఆరోపించారు. అంతే కాకుండా....అభిమానుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ఫిర్యాదు సంగతి అలా ఉంటే... ఏజిఐ మ్యూజిక్ సంస్థ తన పాటలను తస్కరిస్తోందంటూ ఇళయరాజా చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్కు ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా తాము ఇతర సినిమాల సీడీలను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అఖిలన్ ఆరోపించారు.
ఇళయారాజా అభిమానులను తమను ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంపేస్తామంటున్నారని....అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అఖిలన్ తెలిపారు.