Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రామ్ చరణ్ పార్టీ వల్ల రచ్చ: ఎలాంటి కేసు పెట్టని పోలీసులు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అతని స్నేహితులైన ఎమ్మల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరికొందరు కలిసి జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని రామ్ చరణ్ తన నివాసంలో శనివారం రాత్రి పార్టీ చేసుకోవడం, భారీగా లౌడ్ స్పీకర్లు పెట్టి గోల చేయడం చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిన సంగతి తెలిసిందే.
దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు అక్కడికి రావడం, ఇతరకు డిస్ట్రిబెన్స్ కలిగించొద్దని వార్నింగ్ ఇవ్వడం, వారు వినక పోవడంతో రామ్ చరణ్ అతని స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ ఎలాంటి కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. తామె చెప్పిన వెంటనే వారు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా మ్యూజిక్ సౌండ్స్ ఆపేసి లోనికి వెళ్లి పోయారని, అందుకే ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇదీ
సంగతి..
రామ్
చరణ్,
అతని
స్నేహితుల
కారణంగా
చుట్టుపక్కల
వారు
రాత్రిపూట
నిద్రలేక
ఇబ్బంది
పడ్డారు.
దీంతో
ఆ
ఇంటి
పక్కనే
నివాసం
ఉంటున్న
సీనియర్
ఐపీఎస్
అధికారి
గౌతం
సవాంగ్
100
కి
ఫోన్
చేసి
పోలీస్
లకు
సమాచారం
అందించారు.
పోలీసులు
రావడంతో
గొడవ
సద్దుమనిగింది.
గతంలో కూడా రామ్ చరణ్ రోడ్డుపై జరిగిన గొడవ విషయంలో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బాడీగార్డులు ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. రామ్ చరణ్ ఆదేశాల మేరకే వారు అలా రోడ్డుపై రెచ్చిపోయారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.