Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇచ్చిన మాట తప్పని ప్రభాస్ ..ఈ రోజే కొత్త చిత్రం లాంచ్
విశిష్ట అతిథుల మధ్య ప్రభాస్, సుజీత్ల చిత్రం 13వ తారీఖున ప్రారంభం కానుంది.
హైదరాబాద్ :ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రంలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ తదుపరి చిత్రం ఏ గొప్ప ఫిల్మ్ మేకర్ చేతికి వెళుతుందో అని అంతా భావించారు. కాని ప్రభాస్ అందరికి ఆశ్చర్యపరుస్తూ 'రన్ రాజా రన్' ఫేం దర్శకుడు సుజీత్కి ఈ అవకాశం ఇచ్చాడు.
మరో ప్రక్క 'బాహుబలి' చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలను బాలీవుడ్లో చేయనున్నాడు, సుజీత్ తో అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ అయినట్లే అని వార్తలు వచ్చాయి. కాని లాంటిది ఏం జరగకుండా సుజీత్తోనే ముందుకు వెళ్తున్నాడు. అమాంతం పెరిగిన తన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆలోచించకుండా, ఇచ్చిన మాట తప్పకుండా సుజీత్ తో ముందుకు వెళ్లటం గొప్ప విషయం.
అది ప్రక్కన పెట్టి ప్రస్తుత విషయానికి వస్తే... రెండేళ్లుగా సాగుతున్న 'బాహుబలి' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్న సంగతి తెలిసిందే. 'రన్ రాజా రన్' చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కాలం నుండి ఈ ప్రాజెక్ట్ మీదే కష్టపడుతూ మంచి స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నాడు.
For all the darlings and well wishers out there!🤗😎 Pooja tom :) Thanks for all the wishes in advance :) #Prabhas19 shuru karenge!! 🤘🏼
— sujeeth (@sujeethsign) February 12, 2017
'బాహుబలి 2' షూట్ పూర్తై ప్రభాస్ కు కాస్త విశ్రాంతి కూడా దొరకడంతో ప్రభాస్, సుజీత్ ఇద్దరూ చర్చలు జరిపి సినిమాను ఇక లాంచ్ చేస్తే బాగుంటుందని నిర్ణయానికొచ్చారు. ఆ లాంచింగ్ కు ఈ రోజు 13వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ప్రత్యేక అతిధుల మధ్య పూజా కార్యక్రమాలతో ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా ప్రకటించారు. సుజీత్ రేపు ప్రభాస్ తదుపరి చిత్రం లాంఛ్ చేయనున్నామని ప్రకటించగానే బాహుబలి ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తెరకెక్కించడానికి సుజీత్ ఎప్పటి నుండో ప్రణాళిక రచిస్తున్న విషయం తెల్సిందే.