Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘సాహో’ తర్వాత ప్రభాస్ మరో ఫిల్మ్ ఖరారు
ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళంలో తరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్.....
హైదరాబాద్: బాహుబలి ప్రాజెక్టు కోసం ఐదేళ్ల పాటు ఇతర సినిమాలేవీ తీయకుండా కేవలం ఆ ఒక్క ప్రాజెక్టుకే పరిమితం అయిన ప్రభాస్..... ఆ సినిమా పూర్తవగానే వరుస సినిమాలు కమిట్ అవుతూ దూసుకెలుతున్నారు.
ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళంలో తరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్..... దీని తర్వాత మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 'జిల్' మూవీ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కబోతోంది.
ఈ విషయాన్ని రాధ కృష్ణ కుమార్ స్వయంగా వెల్లడించారు. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని ఆయన తెలిపారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ నుండి వస్తున్న ప్రేమ కథా చిత్రం ఇదే అని అంటున్నారు.
ఈ బాహుబలిలోని డార్లింగ్ కోణాన్ని మరోసారి తన సినిమా ద్వారా చూపించబోతున్నాను, ప్రభాస్ తో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని రాధా కృష్ణ కుమార్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు.