Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రూ. 5 లక్షల విరాళం అందించిన ప్రభాస్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. జీసస్ ఓల్డేజ్ హోం కోసం రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు ఆయన తన ఆంధ్రబ్యాంక్ అకౌంట్ నుండి రూ. 5 లక్షల చెక్కు అందజేసారు. ఈ చెక్కుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘బాహుబలి' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, త్వరలో ప్రారంభం కాబోయే ‘బాహుబలి-2' షూటింగుకు సిద్ధమవుతున్నాడు. తన పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
‘బాహుబలి--2' దర్శకుడు రాజమౌళి అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 14 నుండి షూటింగ్ మొదలు కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుకు సంబంధించిన సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి.
బాహుబలి పార్ట్ 1 విజయం అందించిన ఉత్సాహంతో రాజమౌళి అండ్ టీం సెకండ్ పార్ట్ ను మరింత అద్భుతంగా తీయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని, గతంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని అనుభూతి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు పొందుతారని అంటున్నారు.