Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
వరద బాధితులకు ప్రభాస్ విరాళం
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
అందులో భాగంగా రెబల్స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.
వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై నగరానికి సహాయం చేయడానికి టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రూ. 25 లక్షల విరాళం అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మహేష్ బాబు చెన్నై వరద బాధిుతలకు రూ. 10 లక్షల సహాయం ప్రకటించారు. తమిళనాడు సి.ఎం.రిలీజ్ ఫండ్ కి ఈ విరాళాన్ని అందజేస్తారు. మహేష్ బాబు మాట్లాడుతూ...భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.
ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.
"చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను", అని అన్నారు.
వీరితో పాటు జూ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, రవితేజ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50 వేల సహాయం ప్రకటించారు.