Don't Miss!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం
నిజామాబాద్: తమ హీరో పుట్టిన రోజు వేడక అంటే మిగతా హీరోల వాటికన్నా బాగా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తూంటాయి. అయితే ఊహించని విధంగా అవి ప్రమాదాలకి దారి తీస్తూంటాయి.
హీరో పుట్టినరోజుకి, కొత్త సినిమాకి హంగామా చేసే ఈ ఫ్యాన్స్ ఒక్కోసారి తమ ప్రాణాలకే తెచ్చుకుంటారు. మొన్నామధ్య ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన వివాదం, హత్య మరవకముందే మరో హీరో అభిమాని ప్రమాదవసాత్తూ మృతి చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆదివారం (అక్టోబర్ 23న) బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్లోని అభిమానులందరూ అతని జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ వేడుకల సందర్భంగా అభిమానుల్లో ఒకడైన ప్రశాంత్ (19) అనే యవకుడు తన అభిమాన హీరో ఫ్లెక్సీని కడుతుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ వైర్లు తగలడంతో షాక్ తగిలింది. విద్యుత్ షాక్తో అభిమాని ప్రశాంత్ అక్కడిక్కడే మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. ఈ వార్తతో ప్రబాస్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. ఇంకా ఈ విషయమై హీరో ప్రభాస్ స్పదించలేదు. త్వరలో స్పందిస్తారని అభిమాన సంఘాలు భావిస్తున్నాయి.