Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘బాహుబలి-2’ సెట్లో ప్రభాస్ (ఫొటో)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్క్లూజన్'షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ చిత్రం సెట్లో ప్రభాస్ ఉన్న ఒక ఫొటోను చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Catch these moments and lots more on Snapchat! (Username: BaahubaliMovie) #Baahubali #Prabhas pic.twitter.com/MkASt7klwO
— Baahubali (@BaahubaliMovie) March 9, 2016
ప్రభాస్తోపాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో 'బాహుబలి: ది కన్క్లూజన్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రం విశేషాలకు వస్తే.. 2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.
బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.
బాలీవుడ్ లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగం కంటే భారీ స్థాయిలో బాహుబలి-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి-2' రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరానికి పైగా టైం ఉంది.
ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.