Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ వెంట పడుతున్న కార్పొరెట్ కంపెనీలు!
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సౌతిండియా నుండి రూ. 500 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇండియన్ సినీ చరిత్రలో ‘బాహుబలి' ఒక సెన్సేషన్.
ఈ సినిమా పుణ్యమా అని ప్రభాస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. పలు కార్పొరెట్ కంపెనీల దృష్టి కూడా ప్రభాస్ వైపు మళ్లింది. ఇప్పటికే ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీతో పాటు, ఓ టూట్ పేస్ట్ కంపెనీ వారు ప్రభాస్ తో సంప్రదింపులు జరిపారని, తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన్ను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే విడుదలైన బాహుబలి సినిమా భారీ క్రేజ్ వచ్చింది. త్వరలో బాహుబలి పార్ట్ 2 కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో అతనితో యాడ్ ఫిల్మ్స్ చేసి వదిలితే బాగా వర్కౌట్ అవుతుందని పలు కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయట. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ ఇంకా ఏ కంపెనీకి ఓకే చెప్పలేదని సమాచారం. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది.
ఇప్పటికే తెలుగు మార్కెట్లో యాడ్ ఫిల్మ్స్ విషయంలో మహేష్ బాబు టాపులో ఉన్నాడు. అయితే ఆయన చాలా కాస్లీ యాక్టర్ కావడంతో, ఇప్పటికే చాలా ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ ఇప్పటికే యాడ్స్ చేస్తున్నప్పటికీ....వీరు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ తో పలు కంపెనీలు ప్రభాస్ వైపు మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.