Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ ని ప్రశంసిస్తూ ప్రకాష్ రాజ్ ఇలా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్బాబు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడాక ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్ ఆయన్ను ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేసారు.
Dear
mahesh...
Proud
of
u.
Wonderful
step
ahead.
Great
initiative
..
Thank
you..
Let's
give
back
to
life
Cheers
https://t.co/8Lx5t4kX7C
—
Prakash
Raj
(@prakashraaj)
September
29,
2015
ఇక గ్రామాల దత్తత నేపథ్యంగా మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే అంశాన్ని కమర్షియల్ పాయింట్గా తీసుకుని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ఈ చిత్రం ఎందరో ప్రముఖులను కదిలించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శ్రీమంత్రుడు చిత్రాన్ని చూసి మహేశ్బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన మహేశ్బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్కు హామీ ఇచ్చారు.
మహేశ్బాబు, శ్రుతిహాసన్లు ప్రధాన పాత్రల్లో విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని మహేశ్బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
చిత్రం విజయం సాధించడానికి కారణమైన, తమపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఓ కోటీశ్వరుడు గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.