Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ సినిమా నుండి అలా తప్పుకోలేదు: ప్రణీత
హైదరాబాద్: కన్నడ నటి ప్రణీత గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె ఎంపికయిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుండి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. దీనికి కారణాలు రకరకాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. సెట్స్ లో త్రివిక్రమ్ ఆమెపై కోపంతో మండిపడటంతో అవమానంగా ఫీలైన ప్రణీత వెళ్లిపోయిందని తెలుస్తోంది.
అయితే ప్రణీత మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. ఇవి రూమర్సే అంటూ కొట్టిపారేసింది. తాను ఆ సినిమా నుండి తప్పుకోలేదని అంటోంది. అయితే మరో వైపు ఫిల్మ్ సర్కిల్లో మాత్రం ఆమె స్థానంలో నిత్యా మీనన్ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
'జులాయి' వంటి విజయవంతమైన సినిమాను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా రూపొందుతూండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లోనే జరుపుకుంటోంది.
ఇందులో అల్లు అర్జున్తోపాటు హీరోయిన్లు సమంతా, అదా శర్మ, ఉపేంద్ర, స్నేహ కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర కథను మలుపుతిప్పే కీలకమైన క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.