Don't Miss!
- Finance Rekha Jhunjhunwala: ఆ 5 కంపెనీల్లో షేర్లు అమ్మిన రేఖా జున్జున్వాలా.. టాటా స్టాక్స్ కూడా..
- News శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
- Automobiles అప్రిలియా నుంచి 4 సూపర్ టూరర్ బైక్లు లాంచ్.. ఒక్కో బైక్లో ఎన్నో స్పెషాలిటీస్.!!
- Sports KKR vs RR: 12 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నా.. అస్సలు వినడం లేదు: రోవ్మన్ పోవెల్
- Lifestyle వేసవిలో నిమ్మరసం లేదా కొబ్బరి బోండాం ఏది బెటర్? ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
ఇదేం ఐడియా తల్లీ : ఆత్మహత్యలు ఆపాలంటే ..ఫ్యాన్ లు బ్యాన్ చేయాలా
ముంబై: చిన్నారి పెళ్లికూతురు టీవి సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కొన్ని ఊహించని విషయాలు మీడియావద్ద వెల్లడించింది. అవి నిజమో కాదో కానీ మరో సంచలన వ్యాఖ్యం చేసాననుకుని ప్రధానికో సూచన చేసి అందరినీ మాట్లాడుకునేలా చేసింది.
రాఖీ సావంత్ చెప్పిన దాని ప్రకారం.. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని, ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది.
WATCH: Rakhi Sawant demands ceiling fans be banned in all houses, says this is what people use to commit suicidehttps://t.co/fxYPLouh5I
— ANI (@ANI_news) April 5, 2016
అక్కడితో ఆగిందా...మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది.
'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.