Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పీడకల: మాజీ ప్రియుడి గురించి హీరోయిన్
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతా, వ్యాపార వేత్త నెస్ వాడియాతో గత కొన్నేల్లుగా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఐపీఎల్ ప్రాంచైజీ ఓనర్లు కూడా అయ్యారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది.
ఇటీవల మీడియా ఇంటరాక్షన్లో నెస్ వాడియా గురించి స్పందిస్తూ...నా జీవితంలో అతడో పీడకల, మా మధ్య జరిగినంతా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీ నుండి దూరం కావాలనుకోవడం లేదని ప్రీతి జింతా చెప్పుకొచ్చింది.
కాగా...తన పాత మిత్రుడు యువరాజ్తో కొత్త ఎఫైర్ మొదలుపెట్టిందని టాక్ మొదలైంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ తరువాత అమ్మాయిలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్న యువీ.. ప్రీతి జింటాతో సహజీవనం చేస్తున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ప్రీతి కష్టాల్లో ఉందని తెలుసుకున్న యువీ.. ఆమెకు అండగా నిలవడంతో ప్రీతి కూడా అతడిలో కొత్త తోడును చూసుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.