Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విభిన్నమైన కథ దొరికింది: శరణం గచ్చామిపై దర్శకుడు ప్రేమరాజ్
హదైరాబాద్: నవీన్ సంజయ్, తనిష్ తివారి, తన్వి మల్హర్ ముఖ్య పాత్రలో ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న ‘శరణం గచ్చామి' చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు.
బొమ్మకు లక్ష్మి నరసమ్మ స్విచ్ ఆన్ చేయగా సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రేమరాజ్ తమ శిష్యుడని, విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడని, ఈ సినిమా తప్పకుండా సూపర్హిట్ అవుతుందని ఆయన అన్నారు.
దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ రెండు విభిన్నమైన సినిమాలను రూపొందించిన తనకు మూడో సినిమాకు విభిన్నమైన కథ దొరికిందని, మూస పద్ధతిలో వచ్చే సినిమాలకు వైవిధ్యంగా సాగుతుందని, సమస్యను చర్చిస్తూనే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్లో ఈ సినిమా పూర్తిచేస్తామని ఆయన అన్నారు.