Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాత ఆత్మహత్య....ఆపై ప్రియురాలు బలవన్మరణం!
కొచ్చి: మళయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత అజయ్ క్రిష్ణన్ ఏప్రిల్ 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన వెంటనే మరో విషాదం కూడా చోటు చేసుకుంది. అజయ్ క్రిష్ణన్ ప్రియురాలు వినితా నాయర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అజయ్ క్రిష్ణన్ మృతిని తట్టుకోలేక వినీతా నాయర్ మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె సూసైడ్ నోట్లో తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అంచన్ ఎస్ఐ సతీష్ కుమార్ ఈ కేసు విషయమై పోలీసులతో మాట్లాడుతూ....వినీత నాయర్ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉందని తెలిపారు.
బెంగుళూరులో ఫ్యాషన్ డిజైనిగ్ కోర్సు పూర్తి చేసిన వినీతా నాయర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంతో తన ప్రియుడు అజయ్ కృష్ణన్ మరణించడంతో డిప్రెషన్ కు గురైన ఆమె ఆయన లేని జీవితం తనకు వద్దని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారు.
అజయ్ కృష్ణన్ 'అవరుదె రవుగల్' అనే మళయాళ చిత్రానికి నిర్మాత. ఆర్థిక సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.