Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిర్మాత శ్రీరామ్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ బాషల్లో ‘రెడ్ అలర్ట్' చిత్రాన్ని నిర్మిస్తున్న పిన్నింటి వీర శ్రీరామ్ రెడ్డి శనివారం ముంబైలో గుండెపోటుతో కన్నమూసారు. శ్రీరామనవమి రోజున పుట్టిన ఆయన శ్రీరామ నవమి రోజునే చనిపోవడం విశాదం.
వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ రెడ్డి ముంబైలో భవన నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. సినిమాలపై మక్కువతో సినీ నిలయం క్రియేషన్స్ సంస్థ స్థాపించారు. తొలి ప్రయత్నంలో ఒకేసారి నాలుగు బాషల్లో ‘రెడ్ అలర్ట్' నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఇళయారాజా ఆధ్వర్యంలో పాటలను రికార్డ్ చేసారు. మరో పక్క నూతన దర్శకుడు చందూతో ‘ఈ సినిమా సూపర్ హిట్ గురూ' అనే చిత్రం తీస్తున్నారు. శ్రీరామరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేదవ్ ‘రెడ్ అలర్ట్' చిత్రంలో హీరోగా నటించారు. శ్రీరామ్ రెడ్డి మంచి విలువలున్న నిర్మాత అని, ఆయన మృతి తమకు తీరని లోటు అని చంద్రమహేష్ చెప్పారు.