Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమ్మ చనిపోయినంత బాధ: 'ఖైదీ నెం.150' పై ఫేస్ బుక్ లో ఫృధ్వీ షాకింగ్ పోస్ట్
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పై కమిడియన్ ఫృధ్వీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో తెలుగులో వరస సినిమాలతో ఏలుతున్న స్టార్ కమెడీయన్ పృధ్వీని తెగ బాధపెట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా పృద్వీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.
చిరు 150వ చిత్రంలో నటించే గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు. ఈ ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. దాదాపు ఈ కమెడీయన్ పై అన్ని సీన్లను తెరకెక్కించాక ఎడిటింగ్ టైంలో వాటిని తొలగించారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పందించిన పృధ్వీతన సీన్స్ ని ఎడిట్ చేసారని తెలుసుకుని షాక్ అయ్యాడు పృధ్వీ. ఈ విషయం గురించి తన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు.
''చాలా బాధగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంలో నటించడం నా అదృష్టం. సీన్స్ రిమూవ్ చేయడం నా దురదృష్టం. పండగ పూట మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది'' అని ట్వీట్ చేసాడు పృధ్వీ.
ఈ పోస్ట్ ని బట్టి పృధ్వీ ఎంత బాధపడిపోతున్నాడో మనకు అర్ధం అవుతోంది. పృధ్వీ చేసిన సీన్స్ చాలా బాగున్నాయని,. అందుకే పృధ్వీ ఇంత బాధపడిపోతున్నారని అంటున్నారు.
అయితే సినిమా లెంగ్త్ ఎక్కువై నప్పుడు సీన్స్ ఎడిట్ చేయడం సాధారణంగా జరిగే విషయమే. అలా ఎడిట్ చేసే వ్యవహారంలో .. మరీ ముఖ్యంగా కామెడీ సీన్స్ ని ఎడిట్ చేస్తుంటారు. కామెడీ సీన్స్ ఎడిట్ చేయడం వల్ల కథకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలా భావించే పృధ్వీ సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటారు.
సినిమా విడుదలైన తర్వాత ఒక్కోసారి కొన్ని సీన్స్ ని యాడ్ చేస్తుంటారు. అలాంటిది ఏమైనా జరిగి పృధ్వీ సీన్స్ ని సినిమా రిలీజ్ చేసిన తర్వాత యాడ్ చేస్తే, ఇప్పుడు పృధ్వీ పడుతున్న బాధకి అప్పుడు ఊరట కలుగుతుందని అంటున్నాయి సినిమా వర్గాలు.