Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఫీషియల్ : హీరో గ్రీన్ సిగ్నల్, పూరి కి భారీ ప్రాజెక్టు ఖరారు
హైదరాబాద్ : పూరి జగన్నాధ్ ఎప్పుడూ ఖాళీగా ఉండరు. అలాగే చిన్నా, పెద్దా తేడా లేకుండా హీరోలతో ముందుకు వెళ్లిపోతూంటారు. అంతేకాదు ఆయనకు బాషా భేదం కూడా లేదు. అదే వర్కవుట్ అవుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయనకు హిందీలో ఓ భారీ ప్రాజెక్టు సెట్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఖరారు చేసి చెప్తున్నారు.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ... "అవును, నేను సంజయ్ దత్ తో ఓ హిందీ చిత్రం చేయబోతున్నాను, రోగ్ చిత్రం అనంతరం ఈ సినిమా ఉంటుంది. సంజయ్ దత్ నా స్క్రిప్టుని వినిపించాను, ఆయన చాలా ఇష్టపడ్డారు ." అని అన్నారు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్...రోగ్ చిత్రం బిజిలో ఉన్నారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నాడు. నిఖిల్ను వెండితెరపై పరిచయం చేసేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ఎంచుకున్నారు. ఆ చిత్రానికి 'రోగ్' అనే టైటిల్ని నిర్ణయించారు.
గతంలో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ను 'అప్పు' చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. అదే సినిమాని రవితేజతో 'ఇడియట్'గా టాలీవుడ్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్తో 'లోఫర్' తెరకెక్కించిన తర్వాత పూరి ఈ 'రోగ్' పనిలో పడ్డారు.