Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్ ట్వీట్... చిరు సినిమా ఏమైనట్లు?
హైదరాబాద్ :గత కొద్ది రోజులుగా ...ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ...చిరంజీవికి ఓ కథ వినిపించి ఆయన 150వ సినిమాని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారనే వార్తలే. ఆ కాంబినేషన్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూండగానే... ఇప్పుడు నితిన్ ...ఓ ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ నితిన్ చేసిన ట్వీట్ చిరంజీవి సినిమా గురించేమీ కాదు...అతని సినిమా గురించే.
Just
nw
tuk
ful
n
final
narration
of
our
film
vit
@purijagan
packed
heart
touching
entertainer,shoot
fm
June
15
👍
pic.twitter.com/1mvmTQu5ea
—
nithiin
(@actor_nithiin)
June
1,
2015
''పూరి జగన్నాథ్ చెప్పిన పూర్తి కథని విన్నా. హృదయానికి హత్తుకొనే ఓ మంచి వినోదాత్మక కథ. ఈ నెల 15 నుంచే మొదలవుతోంద''ని ట్వీట్ చేశారు నితిన్.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నితిన్ తో చిత్రం చేస్తే మరి ఎప్పుడు చిరంజీవి ఎప్పుడు ప్రారంభమవుతుందంటున్నారు అభిమానులు. ఈ లోగా.. మహేష్బాబుకీ ఓ కథ చెప్పి ఆయనతోనూ ఓకే అనిపించుకొన్నారు. ఈ రెండు చిత్రాలు పట్టాలపైకి వెళ్లేలోపు నితిన్తోనూ ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు పూరి.
జూన్ 15 నుంచే ఆ సినిమా చిత్రీకరణ మొదలవుతోంది. దీని తర్వాతే చిరు 150వ చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.'హార్ట్ ఎటాక్' తర్వాత పూరి, నితిన్ కలసి చేస్తున్న చిత్రమిది.
ఇక పూరి రిలీజ్ కు రెడీగా ఉన్న జ్యోతి లక్ష్మి చిత్రం విషయానికి వస్తే...
పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. వరుణ్ తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'జ్యోతిలక్ష్మీ' తొలి గీతాన్ని విడుదల చేశారు. 'జ్యోతిలక్ష్మీ ఐయామ్ కాస్ట్లీ టు టచ్ మీ..' అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రచించారు.
సునీల్ కశ్యప్ సంగీత సారథ్యంలో ఉమా నేహా గానం చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ ''జ్యోతిలక్ష్మీ స్వభావాన్ని వ్యక్తం చేసే గీతమిది. భాస్కరభట్ల చక్కగా రాశారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
పూరి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మీ అమ్మాయి కాదు. ఆటమ్బాంబు లెక్క! మాటలు సీమటపాకాయల్లా పేల్తూనే ఉంటాయి. ఇక పాటపాడితే.. మామూలుగా ఉంటుందా? అందుకే 'ఏయ్ రాసుకోరా సాంబ..' అంటూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకొంది. ఆ సంగతేంటో తెలియాలంటే జ్యోతిలక్ష్మీ సినిమా చూడాల్సిందే అంటున్నారు .