Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి ఇంట్లో దొంగతనం చేసింది మరెవరో కాదు...
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగలించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడా దొంగ ఎవరనేది తెలిసిందే.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పూర్తి వివరాల్లోకి వెళితే..
పూరీ జగన్నాథ్ ఇంట్లో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు చోరీ చేసింది పనిమనిషేనని తేల్చారు పోలీసులు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషే ఈ దొంగతనం చేసిందని,నగలు పోయినందుకు కోపం రాకున్నా నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు తన భార్య చాలా బాదపడిందని పూరీ తెలిపాడు. ఛోరీ చేసిన నగలను ఆమె దొంగిలించి తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చిందని, పరారీలో ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారన్నాడు.
గత నాలుగు సంవత్సరాలుగా తమ ఇంట్లో పనిచేసుతన్న ఆమె ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయామని, ఆమెను మేమెంతో నమ్మామని వివరించాడు. తన భార్య లేనప్పుడు పనిమనిషి లాకర్ తాళం చేతును దొంగిలించి నగలు ఛోరీ చేసిందని చెప్పాడు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అంగీకరించిందని పూరీ తెలియజేశాడు.
ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్...
ఛార్మితో చేస్తున్న జ్యోతిలక్ష్మి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. రీసెంట్ గా ...ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు. ఆ ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో టైటిల్ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది. జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది.
ఆ ఫస్ట్ లుక్ టీజర్ లో భాస్కరభట్ల రాసిన సాంగ్ ఇలా సాగుతుంది...
‘చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్లం అయిపోయామా... వంటింటి కుందేళ్లలాగా వందేళ్లయినా బ్రతికేద్దామా...ఆడోళ్లం ఆడోళ్లం మనం తోడేళ్లతో ఉంటున్నామా...ప్రాణాలు తోడేస్తూ ఉన్న నోరు మూసుకూర్చుందామా...'
ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.