Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్లో మరో మూవీ!
హైదరాబాద్: ‘కుమారి 21ఎఫ్' మూవీలో జంటగా నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తెరపై తమ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. గతంలో ‘దేనికైనా రెడీ' సినిమాకు దర్శకత్వం వహించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ‘కుమారి 21 ఎఫ్' చిత్రంలో హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శక నిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పంజాబిలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి సుశాంత్ తో ‘ఆటాడుకుందాం రా', మంచు విష్ణుతో ‘సరదా' చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
‘కమారి 21 ఎఫ్' తర్వాత రాజ్ తరుణ్ రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో ఓ సినిమా, వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ రీమేక్, మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయియ్యాడు. రాజ్ తరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడు అంటున్నారు విశ్లేషకులు.