Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వారిరువురికి అవార్డులు రాకపోవడం బాధించింది: రాజమౌళి
టెక్నికల్ గా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన సినిమాగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నబ్లాక్ బస్టర్ 'మగధీర" చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం అయినప్పటికీ ఆ సినిమాకు ఇంకా అవార్డులు ఎక్స్ పెక్ట్ చేసానని, రెండు మాత్రమే రావడంతో డిస్అపాయింట్ మెంట్ అయ్యానని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఐబిన్ లైవ్ చానల్ టెలిపోన్ లో సమాదానం ఇచ్చాడు. అంతే కాకుండా దీని పై మరేవిధంగా స్పందిచలేనని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. అంతే కాకుండా ట్విట్టర్ ద్వారా అవార్డ్ విన్నర్స్ ను తెలియజేసిన ఆయన అభిమానులకు తను స్పెషల్ థాక్స్ తెలియజేశారు.
స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన'కమల్ కణ్ణన్"కు, కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ కు ఈ అవార్డులు రావడం హ్యాపీగానే వున్నప్పటికీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కు రాకపోవడం కొంత బాధ కలిగించింది" అన్నాడు రాజమౌళి. 140కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో 'రోబో" చిత్రాన్ని రూపొందిస్తున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ఇప్పటి వరకు సౌత్ లో రూపొందిన సినిమాలన్నింటిలో 'మగధీర" విజువల్ గా, గ్రాఫిక్స్ పరంగా చాలా గొప్ప సినిమా అని ప్రశంసించడం విశేషం.