Don't Miss!
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘మేరా భారత్ మహాన్’...అసలు రాజమౌళికి సంబంధమే లేదట!
హైదరాబాద్: బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గురించి కొన్ని రోజులుగా మీడియాలో ఓ వార్తల చక్కర్లు కొడుతోంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో రాజమౌళి 'మేరా భారత్ మహాన్' పేరుతో ఓ సినిమా చేస్తున్నారని, బాలీవుడ్ నటుడు సన్నీ డియోన్ ఈచిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారని, సన్నీ డియోల్తో పాటు ఆయన తండ్రి ధర్మేంద్ర కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్టు నిజమే కానీ... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందని అంటున్నారు. ఈ చిత్రానకి దర్శకత్వం వహిస్తుంది రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 'బజరంగీ భాయిజాన్' చిత్రానికి కథ అందించడం ద్వారా గతేడాది బాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ మరో అద్భుతమైన స్క్రిప్టుతో బాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
దేశ భక్తికి సంబంధించిన కథను సిద్ధం చేసకున్న విజయేంద్ర ప్రసాద్ 'మేరా భారత్ మహాన్' చిత్రాన్ని సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాజమౌళి ప్రమేయం అసలు ఉండబోదని అంటున్నారు.
ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-2' సినిమాను తెరకెక్కించడంలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి-2' ప్రాజెక్టు గురించి తప్ప మరే సినిమా గురించి కూడా ఆలోచించడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.