Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రాజమౌళికు ప్రియాంక చోప్రా నుంచే ట్విస్ట్, ఫైనల్ గా ఏమౌతుందో
హైదరాబాద్: ఎప్పటిలాగే.. 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినీలను అనౌన్స్ చేసింది సీఎన్ ఎన్ న్యూస్ 18 గ్రూప్. అయితే ఈ జాబితాలో రాజమౌళి పేరు నామినేట్ చేయబడి ఉండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆయనకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నుంచి పోటీ ఎదురౌతోంది.
ఆ లిస్ట్ లో రాజమౌళి, ప్రియాంక చోప్రా,రణ్ వీర్ సింగ్, సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు. రాజమౌళి తప్ప మిగిలినవారంతా బాలీవుడ్ సెలెబ్రెటీలు కావటం తెలుగు వారికి కొంచెం బాధించే విషయమే. అయినా రాజమౌళికు ఆ అవార్డ్ వస్తే మనకు ఆ బాధ తొలుగుతుంది.
ఇక ఇప్పటికి నామినేషన్స్ మాత్రమే అయినా ఓటింగ్, సెలక్షన్ అయి ఆ తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అయితే ఇప్పటికే ఎన్నో దేశ విదేశీ అవార్డులను ఖాతాలో వేసుకున్న రాజమౌళికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ రాజమౌళికి మాత్రం ప్రధాన పోటీ ప్రియాంక చోప్రా నుంచే అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఆశక్తిక కర పోటీలో రాజమౌళి ప్రియాంక పై పైచేయి సాధిస్తాడా లేదా అన్న విషయం తేలాలి అంటే మరి కొన్నిరోజులు ఆగాలి..
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాల్లో ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించి పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజమౌళి నామినేట్ అయ్యారు. ఆన్లైన్లో నిర్వహించే ఓ పోల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఈ అవార్డు ప్రకటించనున్నారు.