Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చరణ్, విక్రమ్ ట్రైలర్స్ కు రాజమౌళి రివ్యూ
హైదరాబాద్ : తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు చెప్తూండే సెలబ్రెటీ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రాలు, వాటి ట్రైలర్స్ పై ఎప్పటికప్పుడు రివ్యూలను అందిస్తూంటారు. తాజాగా ఆయన గోవిందుడు అందరి వాడేలే, శంకర్ ఐ చిత్రాల ట్రైలర్స్ విడుదల కావటంతో వాటిని చూసి తన అభిప్రాయాలను రివ్యూలాగ అందించారు.
ముందుగా శంకర్ ఐ చిత్రం ట్రైలర్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. "శంకర్ సార్ !!!!! "ఐ" టీజర్ మైండ్ బ్లోయింగ్... ఎవరూ ఆ గ్రాండియర్ కు, విజువల్స్ కు దగ్గరకు కూడా రాలేరు .." అన్నారు. ఇక గోవిందుడు గురించి ట్వీట్ చేస్తూ...‘' చూస్తూంటే కృష్ణ వంశీ గారు తిరిగి తన ఎలిమెంట్స్ తో వచ్చినట్లుంది.. ట్రైలర్ హృద్యంగా, ప్రామిసింగ్ గా ఉంది.. చరణ్ కు పోనీ టెయిల్ బాగా నప్పింది :) అన్నారు.
ఆయన సినిమాల విషయానికి వస్తే...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి...భారీ స్ధాయిలో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరణ సాగుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరుగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.
షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్లలో చిత్రీకరణ జరుగేటట్లు ప్లాన్ చేసారు.
ఇక ఈ చిత్రం కథ అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.