Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'బాహుబలి' ఏడాది పూర్తైంది...(స్పెషల్ వీడియో)
హైదరాబాద్: ఈ రోజుతో 'బాహుబలి' విడుదలై ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోని ట్వీట్ చేశారు. చూసిన ప్రతీ ఒక్కరికీ ధాంక్స్ చెప్పారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.
అలాగే ఎస్.ఎస్. రాజమౌళి మరో విషయం చెప్తూ... '13 ఏళ్ల క్రితం ఇదే రోజు సింహాద్రి విడుదల, చాలా సంతోషంగా ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత.. బాహుబలి విడుదలకు ముందు రోజు, చాలా భయంతో ఉన్నాం' అని అన్నారు.
ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో విడుదలైన 'సింహాద్రి' చిత్రం విడుదల రోజు చాలా సంతోషంగా ఉన్నామని, కానీ బాహుబలి విడుదలకు ముందు ఉత్కంఠతో ఉన్నామని తెలిపారు.
13 years back this day was one of the most joyous?
— rajamouli ss (@ssrajamouli) July 9, 2016
Simhadri release.
12 years later one of the most tensed..
Day before Baahubali release.
2015 జులై 10న ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా తీస్తున్న 'బాహుబలి: ది కన్క్లూజన్' చిత్రం షూటింగ్ జరుగుతోంది.
మరో ప్రక్క 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం వివిధ దేశాల్లో విడుదలౌతోంది. తాజాగా పారిస్లో రిలీజ్ అయిన ఈ చిత్రం త్వరలో చైనాలో విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టి, రికార్డు సృష్టించిన ఈ సినిమాని జులై 22న చైనా స్క్రీన్స్పై ప్రదర్శిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా చైనా భాషలో ఒక పోస్టర్ను విడుదల చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.