twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పద్మశ్రీ’ అవార్డుపై రాజమౌళి ట్వీట్స్.... విమర్శలు, వివరణ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రాజమౌళికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ' అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిది. అవార్డు ప్రకటన అనంతరం రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘ఏ మాట్లాడాలో తెలియడం లేదు. ఇది మిక్డ్స్ ఫీలింగ్. నేను ఈ అవార్డుకు అర్హుడిని అని భావించడం లేదు. ఇదేదో నేను వినయంగా అంటున్న మాట కాదు' అంటూ సోమవారం ట్వీట్ చేసారు.

    రాజమౌళికి కర్నాటక ప్రభుత్వం రికమండ్ చేస్తే అవార్డు రావడంతో.... ఆయన కావాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యంగంగా ఇలాంటి కామెంట్స్ చేసారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు రాజమౌళి.

    లాస్ట్ ఇయర్ ఏపి ప్రభుత్వం నా పేరును పద్మశ్రీ అవార్డుకు పంపాలని నన్ను సంప్రదించారు. నేను అలాంటిదేమీ వద్దని చెప్పాను. అయినా వారు పట్టుబట్టారు. నేను రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేయడంతో నా పేరును ప్రతిపాదించే ప్రయత్నం విరమించారు. అందుకే ఈ సంవత్సరం నన్ను సంప్రదించలేదు.

    అయితే కర్నాటక ప్రభుత్వం వారు నా పేరు ప్రతిపాదించారని తెలిసి ఆశ్చర్య పోయాను. వారు నన్ను సంప్రదించకుండానే నా పేరును పంపారు. నేను కర్నాటకలో పుట్టాను. ఆంధ్రప్రదేశ్ లో చదుకువున్నాను. తమిళనాడులో పని చేసాను. తెలంగాణలో సెటిల్ అయ్యాను. అన్ని రాష్ట్రాలతో అనుబంధం ఉన్నందుకు ఆనందంగా ఉంది అన్నారు రాజమౌళి.

    స్లైడ్ షోలో రాజమౌళి ట్వీట్స్...

    ఈ అవార్డుకు అర్హుడిని కాదు...


    ఏ మాట్లాడాలో తెలియడం లేదు. ఇది మిక్డ్స్ ఫీలింగ్. నేను ఈ అవార్డుకు అర్హుడిని అని భావించడం లేదు. ఇదేదో నేను వినయంగా అంటున్న మాట కాదు అంటూ ట్వీట్ చేసారు.

    గత సంవత్సరం ఏపీ


    లాస్ట్ ఇయర్ ఏపి ప్రభుత్వం నా పేరును పద్మశ్రీ అవార్డుకు పంపాలని నన్ను సంప్రదించారు. నేను అలాంటిదేమీ వద్దని చెప్పాను. అయినా వారు పట్టుబట్టారు అని రాజమౌళి తెలిపారు.

    రిక్వెస్ట్ చేసాను


    నేను రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేయడంతో నా పేరును ప్రతిపాదించే ప్రయత్నం విరమించారు. అందుకే ఈ సంవత్సరం నన్ను సంప్రదించలేదు... అన్నారు రాజమౌళి.

    ఆ విషయం నాకు తెలియదు


    ర్నాటక ప్రభుత్వం వారు నా పేరు ప్రతిపాదించారని తెలిసి ఆశ్చర్య పోయాను. వారు నన్ను సంప్రదించకుండానే నా పేరును పంపారు అన్నారు.

    అన్ని రాష్ట్రాలతో అనుబంధం


    నేను కర్నాటకలో పుట్టాను. ఆంధ్రప్రదేశ్ లో చదుకువున్నాను. తమిళనాడులో పని చేసాను. తెలంగాణలో సెటిల్ అయ్యాను. అన్ని రాష్ట్రాలతో అనుబంధం ఉన్నందుకు ఆనందంగా ఉంది అన్నారు రాజమౌళి.

    English summary
    "Last year the govt of AP wanted to recommend my name for Padma Sri. I requested them not to citing the same reasons. They insisted. But upon my repeated requests, they dropped my name. This year i was not consulted. I was wondering how this happened when I came to know that I was recommended by the Karnataka government. I was born in Karnataka, studied in Andhra Pradesh, worked in Tamil Nadu and settled in Telangana. Happy to be a son of all the states." Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X