Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడే... : 'లింగ' సీడీలు పైరసీ పట్టుకున్నారు
వినుకొండటౌన్ : రిలీజయ్యి..నిండా ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడే పైరసీ భూతం మింగేసే ప్రయత్నం చేసింది. రజనీకాంత్ తాజా చిత్రం లింగా నిన్న ప్రపంచవ్యాప్యంగా అట్టహాసంగా విడుదలైంది. పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని జాగ్రత్రలు తీసుకున్నా ఈ లోగా ఈ చిత్రం పైరసీ వచ్చి అందరినీ షాక్ కు గురించి చేసింది. గుంటూరు జిల్లాలో పోలీసులు చేసిన మెరుపు దాడిలో లింగా చిత్రానికి సంభందించిన మూడు వేల సీడిలు దొరికాయి.
సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరుజిల్లా వినుకొండ కేంద్రంగా కొత్తసినిమాల పైరసీ సీడీలను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు గృహాల్లో ఆధు నాతన సాంకేతిక పరికరాలతో సినిమా రిలీజ్ అయిన రోజునే సీడీలను తయారుచేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు 40 వేల పైరసీ సీడీలు, 22 మానిటరింగ్ సీపీయూలు పట్టుపడ్డాయి. పట్టుపడ్డ సీడీల్లో శుక్రవారం విడుదలైన రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాకు సంబంధించిన 3 వేల సీడీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా వినుకొండకు చెందిన కొలిశెట్టి వెంకటరామాంజనేయులును అదుపులోకి తీసుకొన్నారు.