Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అభిమాని మృతి: రామ్ చరణ్ రూ. 2 లక్షల సహాయం
హైదరాబాద్: ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం టిక్కెట్ల కోసం ప్రయత్నించి తొక్కిసలాటలో కన్నయ్య అనే అభిమాని మృతి చెందిన ఘటనపై ఆ చిత్ర నటుడు రామ్ చరణ్ తేజ్ స్పందించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు. కన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన రామ్ చరణ్.....అతని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ వద్ద బుధవారం(అక్టోబర్ 1) జరిగిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్ అభిమాని అయిన కన్నయ్య... గోవిందుడు అందరి వాడేలే తొలి రోజు తొలి షో చూడానే కోరికతో టిక్కెట్ల కోసం లైన్లో నిల్చున్నాడు. అయితే జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది.
టిక్కెట్ క్యూ లైన్లో జనాల మధ్య ఇరుక్కుపోయిన కన్నయ్య ఊపిరి ఆడక మరణించాడు. కన్నయ్య మృతికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. సరైన భద్రత ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.