Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అది రామ్ చరణ్ వదులుకున్న బంగారమేనా?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం' చిత్రం విడుదలై మంచి రొమాంటిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మణితర్నం ఈ సినిమాతో విజయం అందుకున్నారు. మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, లవ్ అంశాలను బేస్ చేసుకుని ఎంతో బ్యూటిఫుల్ గా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించాడు మణిరత్నం. యువతను ఈచిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వాస్తవానికి ఈ చిత్రం...రామ్ చరణ్తో చేయాల్సింది అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి నో చెప్పడంతో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసే అవకాశం దక్కిందని అంటున్నారు. గతంలో ఓ సారి మణిరత్నం, సుహాసిని స్వయంగా వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ లను కలిసారు.
అప్పట్లో మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటికే ‘ఆరెంజ్' లవ్ స్టోరీతో దెబ్బతిని ఉన్న రామ్ చరణ్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా చేయడానికి సాహసం చేయలేక పోయాడు. అందుకే మణిరత్నం చెప్పిన స్టోరీ (ఇప్పటి ఓకే బంగారం)ని చేయడానికి నిరాకరించాడట. చిరంజీవి సూచన మేరకే రామ్ చరణ్ ఈ స్టోరీని తిరస్కరించాడని టాక్.