Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓన్లీ రీసౌండ్ :రాంచరణ్ కొత్త చిత్రంఅఫీషియల్ టీజర్ (వీడియో)
హైదరాబాద్: రాంచరణ్, రకుల్ప్రీత్సింగ్లు ప్రధాన పాత్రల్లో శీను వైట్ల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ని శుక్రవారం రాత్రి చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం డి.వి..వి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల అఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు.
క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దాంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది. క్లైమాక్స్ సీన్ పై అంత ఖర్చు పెట్టడాన్ని నిర్మాతని,దర్శకుడుని కొందరు అడిగితే ఇది రామ్ చరణ్ సినిమాలో క్లైమాక్స్ అందుకే అంత ఖర్చు పెడుతున్నాం. పెట్టినదానికి రెండింతలు వస్తుందని ధీమాగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం బ్యాంకాక్ లోనూ, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు టీజర్ ని రెడీ చేసి విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే ఈ టీజర్ ని ఇప్పటికే చూసిన తమన్ ఈ విషయాన్నిచాలా ఎక్సైటింగ్ గా ట్వీట్ చేసారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు.
ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్ గురించి బ్యాంకాక్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.