Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోదావరి పుష్కరాలకు రామ్ చరణ్ విమానాలు...
హైదరాబాద్: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... ‘ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే.
తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం....ఈ విమాన సంస్థ గోదావరి పుష్కరాలకు విమాన సర్వీసులు నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన శాఖ నుండి అనుమతులు రాగానే సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి తిరుపతి, బెంగుళూరు, షిర్డిలకు ఈ విమాన సర్వీలు తొలుత నడపాలని ప్లాన్ చేస్తారు. అయితే గోదావరి పుష్కరాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని మిని ఏరోప్లేన్స్ కొనుగోలు చేసింది.
ఆ సంగతి పక్కన పెడితే...రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి బ్రూస్ లీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.