Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కావిడ మోస్తూ చరణ్, సుకుమార్ వదిలిన ప్రీ లుక్ అదిరింది (ఫొటో)
రామ్ చరణ్ తన కొత్త చిత్రం షూటింగ్ లాంఛనంగా మొదలెట్టి, ప్రీ లుక్ విడుదల చేసారు.
హైదరాబాద్: రీసెంట్ గా ధృవ వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన రామ్ చరణ్ తన కొత్త చిత్రం మొదలెట్టేసారు. ఈ రోజు షూటింగ్ లాంఛనంగా మొదలెట్టి, ప్రీ లుక్ విడుదల చేసారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ప్రీ రిలీజ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
#RC11Begins ❤️ pic.twitter.com/C6oIx2QmKX
— #RC11Begins (@MythriOfficial) January 30, 2017
ఈ సినిమా పచ్చి పల్లెటూరి వాతావరణంతో తెరకెక్కిస్తున్నారు. ఆ విషయాన్నినిజమే అని చెప్పటానికి అన్నట్లు.... చరణ్ కి సంబంధించిన ప్రీ లుక్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసారు సుకుమార్. ఓ పల్లె నేపధ్యంలో.. రెండు బిందెలను కావడిలో మోస్తున్న హీరో లుక్.. స్కెచ్ రూపంలో మనకు కనిపించంటం ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు.
#RC11Begins pic.twitter.com/4UAlcQIMCM
— #RC11Begins (@MythriOfficial) January 30, 2017
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ కరెక్టు గా సంవత్సరం తర్వాత... రాం చరణ్ కోసం ఓ పీరియాడిక్ లవ్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. కోనసీమ బ్యాక్ డ్రాప్లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న సుక్కు, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాంచరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.