Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాంచరణ్ దంపతులు మహారుద్రశత చండీ యాగం
హైదరాబాద్ : మహారుద్ర శత చండీయాగంలో రాంచరణ్, ఉపాసన దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు నిర్వహించిన యాగంలో పాల్గొని పూర్ణ కుంభంతో పూర్తి చేశారు. కాగా, రాంచరణ్ను చూడటానికి ఆయన అభిమానులు ఎగబడ్డారు.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా దోమకొండలోని గడికోటలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సినీ హీరో రాంచరణ్తేజ్ పాల్గొన్నారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో గత పది రోజులుగా మహారుద్ర శతచండీ యాగం కొనసాగుతోంది. గురువారం చండీయాగం ముగింపు కార్యక్రమం, పుర్ణాహుతి నిర్వహించారు.
రాంచరణ్ తేజ్ తన భార్య ఉపాసనతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు వారు పుర్ణాహుతి, మహారుద్ర శత చండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది పండితులు యాగంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గండికోట వారసులైన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావ్, ఆయన భార్య పుష్పమ్మ, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ శోభన, జాతీయ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కామినేని అనిల్కుమార్ పాల్గొన్నారు.