Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంటాడుతున్న వినాయకుడు: వర్మకు ముంబై కోర్టు సమన్లు!
రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 8 లోపు కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
ముంబై: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. వినాయకుడిపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ఆయనకు ఈ సమన్లు జారీ అయ్యాయి. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 8వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2014లో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా హిందూ గాడ్ వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయగా.... ఆయన్ను ఈ కేసు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 'అవయవాలే సరిగా లేని వినాయకుడు తన భక్తుల బాధలు తొలగిస్తాడట.. విచిత్రంగా ఉంది' అంటూ రామ్ గోపాల్ వర్మ అప్పట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ వివేక్ శెట్టి ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. దీనిని విచారించిన కోర్టు ఆర్జీవీకి సమన్లు జారీ చేసింది. తన వ్యాఖ్యలకు వర్మ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. ఇటీవల వర్మ తన ట్విట్టర్ ఖాతా నుండి కూడా వైదొలగిన సంగతి తెలిసిందే.