Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ సినిమా ఎనౌన్స్ చేసారు
హైదరాబాద్ : ఎన్నో కథలు విని, ఎంతో మంది దర్శకులును పిలిచి మాట్లాడి చివరకు రామ్ తన తదుపరి చిత్రం ఓకే చేసారు. రామ్ కొత్త చిత్రం ఎనౌన్స్ చేసారు. ఈ సారి రామ్ ని బలుపు తో ఫ్లాప్ లలో ఉన్న రవితేజకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ని దర్శకుడుగా ఎంచుకున్నారు. యునైటెడ్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. పరుచూరి కిరీటి నిర్మాత.
'డాన్శీను'తో ఆకట్టుకొన్నారు గోపీచంద్ మలినేని. 'బలుపు'తో గతేడాది మరో విజయం అందుకొన్నారు. మధ్యలో వచ్చిన బాడీ గార్డ్ నిరాశరిచినా..బలుపు హిట్ తో ఆయనకి మంచి క్రేజే ఉంది. అల్లు అర్జున్ తో చిత్రం అని స్క్రిప్టు రెడీ చేసుకుని సిద్దమవుతున్న సమయంలో ...రామ్ తో ఎనౌన్స్ చేసి అందిరనీ ఆశ్చర్యంలో ముంచారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్, యాక్షన్, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు. ''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్ కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . సమర్పణ: పరుచూరి ప్రసాద్.