Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కత్రినాపై కన్నేసిన క్రికెటర్.. నిర్మాతగా సంజయ్తో ఉగ్ర చిత్రం..
క్రికెట్ ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించే కథతో తాను సినిమాను నిర్మిస్తున్నట్టు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్తో రూపొందించే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్
సినీ నటులుగా మారిన క్రికెటర్లను గతంలో ఎంతో మందిని చూశాం. కానీ తాజాగా పాకిస్థాన్కు చెందిన ప్రముఖ క్రికెటర్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా నిర్మాతగా మారనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్తో రూపొందించే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. క్రికెట్ ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించే కథతో తాను సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రమీజ్ రాజా
ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. సినీ పరిశ్రమకు రమీజ్ కొత్తేమీ కాదు. 2016లో బాలీవుడ్లో ఓ చిత్రంలో నటించారు. బాలీవుడ్ స్టార్లు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ నటించిన ‘డిష్యూం'లో రమీజ్ అతిథి పాత్రను పోషించారు. కిడ్నాప్ గురైన క్రికెటర్ పాత్రలో ఆయన ఆకట్టుకొన్నారు.
కత్రినా కైఫ్, మహిరాఖాన్ పేర్ల పరిశీలన
యాక్షన్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని రమీజ్ అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక జరుగలేదని, పలువురి పేర్లను పరిశీలిస్తున్నామని జియో న్యూస్ కు చెప్పారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పాకిస్థాన్ సంతతికి చెందిన మహీరా ఖాన్ అత్యంత ప్రతిభావంతులైన తారలని, వారు ఆసక్తి చూపితే వారితో పనిచేయడానికి సిద్ధమని రమీజ్ తెలిపారు.
సంజయ్ బయోపిక్లో రణబీర్ కపూర్
ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ శిక్ష అనుభవించి ఇటీవల పుణెలోని ఎర్రవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్నది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సంజయ్ పాత్రను పోషిస్తున్నాడు.
పాకిస్థాన్ తీరు సిగ్గుచేటు
ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నిలోని రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫైనల్ మ్యాచ్ ను పాకిస్థాన్ లో ప్రసారం చేయకపోవడాన్ని రమీజ్ రాజా తప్పుపట్టారు. క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీసేలా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. పాక్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.