Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రెచ్చిపోయారంతే : తమన్నా, రాశి ఖన్నా ...మధ్యలో రవితేజ (వీడియో)
హైదరాబాద్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్ టైగర్'. సంపత్నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 27న 'బెంగాల్ టైగర్' ప్రేక్షకుల ముందుకు రానుందని అఫీషియల్ గా దర్శకుడు ప్రకటించారు. దాంతో చిత్రం ప్రమోషన్స్ పై పూర్తి దృష్టి పెట్టింది యూనిట్. అందులో భాగంగా చిత్రంలోని సాంగ్ టీజర్ ని విడుదల చేసింది. ఈ పాటలో తమన్నా, అటు రాశి ఖన్నా, రవితేజ ముగ్గురూ రెచ్చిపోయి డాన్స్ చేసారు.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది.
రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్కి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.
దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్లోనే కథ ఓకే చేశారు. బీమ్స్కి నేనేదో లైఫ్ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.
ఈ సినిమా సరికొత్త థియోటర్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఆ మధ్యన విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారు ఈ ఒక్కటి చాలు బిజినెస్ అవ్వటానికి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
రవి తేజ సరసన తమన్న, రాశి ఖన్నాలు ఆడిపాడునున్నారు. సంపత్ నంది రెండవ సినిమా రచ్చలో కూడా తమన్ననే హీరోయిన్ కావడం విశేషం. ఏమైంది ఈ వేళతో ప్రతిభ గల దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండవ సినిమాతోనే రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం చేశాడు. రచ్చ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.
ఆ సినిమా స్రిప్టు తయారు చేసే పనిలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏంటో తెలియదు కాని ఆ సినిమా నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. అనూహ్యంగా రవితేజాను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రవితేజకు తమన్నతో తొలి సినిమా. తమన్న తన అందచందాలతో మురిపించబోతోంది.