Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఏమిటీ షాక్...! రెజీనా జూనియర్ ఆర్టిస్ట్ గానా? ఇది నిజంగా నిజమేనా..!?
గోవిందుడు అందరివాడేలే సినిమాకు తర్వాత కృష్ణ వంశీ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. నక్షత్రం అనే పేరిట ఈ సినిమా తెరకెక్కుకోంది. ఈ సినిమాలో రెజీనా గెటపే ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అందాల కథానాయిక రెజీనా జూనియర్ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే, ఇది నిజజీవితంలో కాదులెండి.. 'నక్షత్రం' సినిమా కోసం ఆమె అలా మారింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. అందులో ఆమె సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తుందని తెలుస్తోంది. జమునారాణి అనే ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు మీడియాకు రిలీజ్ చేస్శారు. ఇందులో ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తూ అందాలు విరజిమ్ముతోంది.
అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్ పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నట్టు గతంలోనే ఓ వార్త బయటికి వచ్చింది. ఇక ఈ సినిమాలో రెజీనా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోందనేది తాజా సమాచారం. సెట్లో ఖాకీ డ్రెస్ లో ఉన్న రెజీనా ఫోటోను సందీప్ కిషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "మంచి పోలీసా.. చెడ్డ పోలీసా?" అంటూ ఒక ప్రశ్నను కూడా వేయటం తో రెజీనా కూడా పోలీస్ పాత్రలోనే కనిపించనుందంటూ వార్తలు వచ్చాయి గానీ అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకోవడం విశేషం.
అందుకే సక్సెస్ లు లేకపోయిన ఛాన్స్ లు పెరగడంతో అమ్ముడు అమాంతం తన రెమ్యూనేషన్ పెంచింది. 'రెజీనా' ప్రస్తుతం నాలుగు క్రేజీ సినిమాలు చేస్తోంది. 'కృష్ణవంశీ' 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహిస్తున్న 'జ్యో అచ్యుతానంద' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇక తమిళంలోనూ 'మా నగరం' అనే సినిమా చేస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో 'ఆంఖే 2' చిత్రంలో నటించే ఛాన్స్ పట్టేసింది. కేవలం బాలీవుడ్ లో ఛాన్స్ రావడం వల్లే 'రెజీనా' రెమ్యూనేషన్ పెంచినట్లు వినిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.60 లక్షల రెమ్యూనేషన్ తీసుకున్న ఈ చెన్నై పిల్ల ఇక నుంచి రూ. కోటి 50 లక్షలకు ఏ మాత్రం తగ్గేది లేదని చెప్పుతోందట.