Don't Miss!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చిరు 150లో స్పెషల్ సాంగు చేయబోయేదెవరో తెలుసా?
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సినిమా అలా ప్రారంభం అయిందో లేదో...ఇలా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ చిత్రానికి ఇంకా అఫీషియల్ గా హీరోయిన్ ఖరారు కాక పోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నారు.
తాజాగా హీరోయిన్ రెజీనా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ ఇందులో హీరోయిన్ కాదని....ఓ స్పెషల్ సాంగు కోసం ఆమెను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం నయనతార, అనుష్కలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుందని....చిరంజీవికి సూటయ్యే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఏ హీరోయిన్ డేట్స్ అడ్జెస్ట్ అయితే వారినే తీసుకోవాలని అనుకుంటున్నారట.
తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు. చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు.
ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.