Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సూర్యతో రేణు దేశాయ్ న్యూ ఇయర్ లంచ్ (ఫోటోస్)
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన పిల్లు అకీరా, ఆద్యాలతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు ఎస్.జె.సూర్యతో కలిసి న్యూ ఇయర్ లంచ్ చేసారు. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన ఫోటోను ఆమె న్యూ పోస్టు చేసారు. ఈ ఫోటో తీసింది తన కుమారుడు అకీరా అని ఆమె పేర్కొన్నారు.
New
year
lunch
with
Surya
sir...:)
pic
clicked
by
Akira
&Aadya
hiding
behind
me
:D
pic.twitter.com/Af5hSPSoPx
—
renu
(@renuudesai)
January
1,
2016
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయినా.... ఇద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీరు నచ్చక పోవడం, తాను ఏ కామెంట్ చేసినా వారు మరో మరో రకంగా అర్థం చేసుకోవడం లాంటి పరిణామాలతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం మానేసిందని, పవన్ గురించి ఆలోచనలకు కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుప్పుడు రేణు దేశాయ్ వద్దకు వచ్చి పిల్లలను కలిసి వెలుతున్నారు.
మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.
‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్గా వీరి పెళ్లి తంతు జరిగింది.
నటిగా కెరీర్కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.