Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరి జగన్నాథ్ సినిమాకు నటి రేవతి దర్శకత్వం?
హైదరాబాద్: సౌతిండియాలో ప్రముఖ నటీమణుల్లో రేవతి ఒకరు. త్వరలో ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాను ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
నటిగా రేవతి తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ఆమె ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002లో ఆమె దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లిస్ మూవీ 'Mitr, My Friend' సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది.
తర్వాత ఆమె దర్శకత్వంలో హిందీలో 2004లో ‘ఫిర్ మిలేంగే', 2009లో మళయాలంలో ‘కేరళ కేఫ్', 2010లో హిందీలో ‘ముంబై కట్టింగ్' అనే చిత్రాలు వచ్చాయి. 2011లో రేవతి దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘రెడ్ బిల్డింగ్ వేర్ ఈజ్ ది సన్ సెట్'కు జాతీయ అవార్డు దక్కింది.
పూరి జగన్నాథ్ నిర్మాణంలో రేవతి ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రేవతి దర్శకత్వం అంటే ఆ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలకు దూరంగా, సామాజిక అంశాల నేపథ్యంలోనే ఆమె సినిమాలు ఉంటాయి.