Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ: రామ్ గోపాల్ వర్మ ప్లాన్
హైదరాబాద్: సాంకేతిక రంగాల్లో రోజురోజుకు మారుతోన్న అనేక టెక్నికల్ పెను విప్లవాల పుణ్యమా అని, ప్రపంచం మొత్తం ఓ చిన్న ‘గ్లోబల్ విలేజ్'గా మారిపోతూ, లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడిపై కదలికలను సైతం నిల్చున్న చోటు నుంచే చూపిస్తున్న ఆధునిక యుగంలో...ఓ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లోనో, ముంబైలోనో, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి విజయవాడలోనో, వైజాగ్లోనో ఇంకా అదేదో ఫలానా చోట ఉండాలని ఫిక్స్ అవ్వడం చాలా పాతకాలపు ఆలోచనలతో కూడిన మూర్ఖపు అవివేకం అంటున్న దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తన వాదనను ఇపుడు ఆచరణ రూపంలో పెట్టబోతున్నారు.
‘తెలంగాణ ఉద్యమ పరిటిగడ్డ' కరీంనగర్ లో నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు శాతవాహన యూనివర్శిటీలోని ఒక బహిరంగ వేదిక ద్వారా ‘అవగాహన సదస్సు'ను ఏర్పాటు చేసి..‘హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఒక్క వ్యక్తి కూడా తెలియకపోయినా, ఎలా కరీంనగర్ లోనే ఓ సినిమా ఇండస్ట్రీ పెట్టి మిగతా ప్రాంతాలతో ఏ మాత్రం సంబంధాలు లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా కూడా సినిమాలు తీసి వాటిని ఎలా రిలీజ్ చేయ్యచ్చో వివరిస్తానని ఆర్జీవి చెబుతున్నారు.
కరీంనగర్ ఫిలిం ఇండస్ట్రీలో పాల్గొనడానికి ఆసక్తి ఉండి, కరీంనగర్ లో ఉన్నవాళ్లెవరైనా సరే ఈ నవంబర్ 18న మీటింగుకి రావచ్చని రామ్ గోపాల్ వర్మ పిలుపునిచ్చారు.