Don't Miss!
- Finance Airtel, Jio: కస్టమర్లకు షాక్ ఇవ్వనున్న ఎయిర్ టెల్, జియో..!
- Sports Hardik X Rohit: హార్దిక్తో గొడవ లేదని రోహిత్ ఎందుకు చెప్పట్లేదు?
- News మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Technology శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ కీలక వివరాలు లీక్.. Wi-fi, eSIM సహా 32GB స్టోరేజీతో లాంచ్..?
- Automobiles భారతీయులు ఎక్కువగా ఏ కలర్ కార్లను ఇష్టపడుతున్నారో తెలుసా.. వాటిని చూస్తే మనసు పారేసుకుంటారు.!!
- Lifestyle సైజ్ చూసి పుచ్చకాయ కొనకండి..పుచ్చకాయ తియ్యగా మరియు పండినది కొనాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.
- Travel సమ్మర్ వెకేషన్కు సరైన ఎంపిక.. జార్ఖండ్లోని ఈ 5 హిల్ స్టేషన్లు!
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సచిన్
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ సారి ఆయన సచిన్ జోషితో సినిమా తీయబోతున్నాడు. తెలుగు-హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న వర్మ ఇపుడు సచిన్ ద్వారా బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
సచిన్ జోషి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘నీ జతగా నేనుండాలి' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రా బాక్సీఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా రాబట్టలేక పోయాయి. మరి ఇద్దరూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో అందరూ సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటే.....వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందరికీ విష్ యూ ఎ సాడ్ ఇయర్ అంటూ ట్వీట్ చేసాడు. ‘మనం ఎప్పుడూ నూతన సంవత్సరంలోకి పాత సంవత్సరానికి సంబంధించిన మన బాధలను కూడా తీసుకెలుతున్నాం. అందుకే నేను అందరికీ సాడ్ ఇయర్ అంటూ విష్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. అయితే ప్రజలు ఎప్పటికీ కేవలం నమ్మకంతో జీవిస్తున్నారు. వారికి లాజిక్ తెలియదు. అందుకే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెబుతున్నాను అంటూ మరో ట్వీట్ చేసాడు