Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ ‘బ్రహ్మోత్సవం’: పాట కోసం రూ.3.5 కోట్లు ఖర్చు
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ సాంగు కోసం ఏకంగా రూ. 3.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
భారీగా ఖర్చు పెట్టి తీస్తున్న ఈ సాంగు మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సాంగును చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబుతో పాటు ప్రణీత, జయసుధ, సాయాజీ షిండే, తనికెళ్ల భరణి, నరేష్, కృష్ణ భగవాన్ తదితరులు ఈ సాంగులో కనిపించనున్నారు.
ఈ సాంగు చిత్రీకరణకు సెట్టింగ్ష్, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ. 3.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక సాంగు కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అరుదు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోల సినిమాల్లోనే ఇలాంటి సాధ్యం.
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన చాందినీ చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి సాంగులో నటించే అవకాశం దక్కించుకుంది. మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో సమంత, కాజల్ నటిస్తున్నారు. అక్టోబర్ 5 నుండి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.