Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ సీన్తో దిల్ రాజు ‘ఫిదా’ చేశారు, సాయి పల్లవి ఆశ్చర్యం!
ఫిదా సక్సెస్ కావడంతో సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది. తన పాత్రకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదన్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫిదా' చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా విడుదల ముందు ట్రైలర్స్ చూసిన తర్వాత హైప్ ఓ మోస్తరుగా మాత్రమే ఉండేది. సినిమా విడుదలైన తర్వాత కూడా ఓ మోస్తరు హిట్ అవుతుందని మాత్రమే అంతా అంచనా వేశారు.
అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలకు మించిన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శుక్రవారం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండటంతో ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు ఖాయం అని అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.
ఆ సీన్ పెట్టించింది దిల్ రాజు
దిల్ రాజు తను నిర్మించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన నచ్చని సీన్లను నిర్మొహమాటంగా లేపేస్తాడు, అదే సమయంలో తనకు కవాల్సిన సీన్లను దర్శకుడితో చేయిస్తాడు. 'ఫిదా'లో కూడా ఓ సీన్ను శేఖర్ కమ్ములకి చెప్పి మరీ పెట్టించారట. క్లైమాక్స్ హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను హత్తుకునే సీన్ ఆయన ప్లానేనంట. సినిమా చివర్లో ఈ సీన్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది.
Recommended Video
హీరోయిన్ సూపర్
ఇక ‘ఫిదా' సినిమాలో హీరో వరుణ్ తేజ్తో సమానంగా హైలెట్ అయింది హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకు తెలుగు భాష తెలియక పోయినా, తెలంగాణ యాస రాక పోయినా... కేవలం దర్శకుడు చెప్పిన సూచనలను పాటిస్తూ తెలంగాణ యాసలో అచ్చం తెలంగాణ అమ్మాయిలాగా డబ్బింగ్ చెప్పడం విశేషం.
సాయి పల్లవి
'భానుమతి' అనే తెలంగాణ యువతి పాత్రలో ఆడియన్స్ తనని రిసీవ్ చేసుకుంటారా? తెలంగాణ యాసను పలికించడంలో తన వాయిస్ వాళ్లకి నచ్చుతుందా? ఇలా తనపై తనకి ఎన్నో సందేహాలు వుండేవనీ, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో అవన్నీ పటాపంచలు అయ్యాయని సాయిపల్లవి తెలిపింది.
ఆశ్చర్యం
తన పాత్ర చెప్పే డైలాగ్స్కి ఆడియన్స్ క్లాప్స్ కొట్టడాన్ని, విజిల్స్ వేయడాన్ని చూస్తూ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నానని అంది. ఈ క్రెడిట్ అంతా కూడా తన నుంచి అంతటి అవుట్ పుట్ ను రాబట్టిన శేఖర్ కమ్ముల గారికి చెందుతుందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.