Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వాడు నేను కాదు... అంటున్న పూరి జగన్నాథ్ సోదరుడు!
హైదరాబాద్: పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్..... టాలీవుడ్లో చాలా కాలంగా హీరోగా నిలదొక్కుకునేందుకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కెరీర్లో ఆయనకు చెప్పుకోదగ్గ సినిమాలు రెండే రెండు. ఒకటి ‘143', మరొకటి ‘బంపరాఫర్'. ఇవి భారీ హిట్లు కాక పోయినా...సాయిరాం శంకర్ అనే వాడు ఇండస్ట్రీలో ఉన్నాడు అనే గుర్తింపు మాత్రం అతనికి తెచ్చి పెట్టాయి.
సాయిరాం శంకర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లవుతోంది. 143 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లవుతోంది. 2009లో వచ్చిన ‘బంపర్ ఆఫర్' హిట్టు అనేదే లేదు. ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసినా నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. చివరగా 2014లో వచ్చి రోమియో పెద్ద ప్లాప్.
హిట్టు సినిమాలు లేకుంటే అవకాశాలు రావడం కష్టమే. సాయి ప్రస్తుతం సాయిరాం శంకర్ ఈ రెండేళ్ల గ్యాపులో ఎలాగో అలా రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘వాడు నేను కాదు', ‘అరకు రోడ్డులో' చిత్రాల్లో నటిస్తున్నాడు. అరకు, విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమాల షూటింగ్ జరుగుతోంది. ‘వాడు నేను కాదు' సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
మరో రెండు మూడూ సినిమాలు హీరోగా ట్రై చేసి.... ఇక దర్శకత్వం వైపు మళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు సాయిరాం శంకర్. సినిమా రంగంలో నేనేంటో నిరూపించుకుంటాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. ఇప్పటికే చాలా ఏళ్లు గడిపోయాయి. ఇంకా ఎప్పుడు నిరూపించుకుంటాడో ఏంటో?