Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హీరోయిన్ను ఇబ్బంది పెట్టిన అల్లరి నరేష్ ఫ్యాన్స్
హైదరాబాద్: అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్'. ‘నేను కాదు నా పెళ్లాం'ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత.
‘జేమ్స్ బాండ్' మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ చిత్ర హీరో అల్లరి నరేష్, సాక్షి చౌదరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తనుకు, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సక్సెస్ టూర్ సాగింది.
టూర్ కోసం భారీగా ఏర్పాట్లు చేసిన నిర్మాతలు.... హీరోయిన్ ఇబ్బంది పడకుండా చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేయలేదట. దీంతో ఆమె వెళ్లిన ప్రతి చోటా అల్లరి నరేష్ అభిమానుల మూలంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పలువురు ఫ్యాన్స్ ఆమెను టచ్ చేయడానికి పోటీ పడ్డారు. బౌన్సర్లు లేక పోవడంతో ఆమె వారి మూలంగా చాలా ఇబ్బంది పడినట్లు సమాచారం.
పక్కన అల్లరి నరేష్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయాడని టాక్. అలా ఇబ్బంది పడుతూనే సినిమా ప్రమోషన్లలో పాల్గొంది సాక్షి చౌదరి. పాపం... పాప ఎంత కష్టపడింది.